SEC : గ్రామ పంచాయతీ ఎన్నికలను Local body elections పురస్కరించుకుని ఇటీవల టీడీపీ TDP అధినేత చంద్రబాబు Chandra babu మేనిఫేస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం ఏమిటంటూ వైసీపీ YCP ప్రశ్నించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)కి వైసీపీ పిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుపై తెలుగుదేశం పార్టీకి వివరణ ఇవ్వాలంటూ ఎస్ఈసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 2వ తేదీ వివరణ ఇవ్వాలని కోరగా టీడీపీ ..మేనిఫెస్టోపేై వివరణ ఇచ్చింది, అయితే ఎస్ఈసీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చింది. వివరణ సంతృప్తికరంగా లేదని ఎస్ఈసీ పేర్కొంటూ టీడీపీ మేనిఫేస్టోను రద్దు చేసింది. తక్షణం టీడీపీ మానిఫేెస్టోను ఉపసంహరించుకోవాలని ఎస్ఈసీ ఆదేశించింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయాలకు అతీతంగా జిరగే పంచాయతీ ఎన్నికలకు మానిఫెస్టో విడుదల చేయడం ఏమిటంటూ వైసీపీ శ్రేణులు ,సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.