NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీపై పవన్ వ్యాఖ్యల దుమారం చల్లారకముందే సంచలన కామెంట్స్ చేసిన కన్నా

ఏపీ బీజేపీ నాయకత్వంపై రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే బీజేపీలో మరో సంచలనం చోటుచేసుకుంది. బీజేపీ, జనసేన పొత్తు అని చెబుతున్నా ఆ పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించింది. సంఘటిత కార్యక్రమాలు నిర్వహించలేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో కలవడం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ కలిసి ప్రయాణించే పరిస్థితులు లేనట్లుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏపిలో తాజా రాజకీయ పరిణామాలు వివరించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లారు. ఈ తరుణంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మళ్లీ దుమారాన్ని రేపుతున్నాయి.

AP BJP

 

పార్టీని నడిపేవిషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు కన్నా లక్ష్మీనారాయణ. పార్టీ రాష్ట్ర శాఖలో అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియడం లేదని అన్నారు. గతంలో తాను అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ప్రతి రెండు నెలలకు ఒక సారి కోర్ కమిటీ భేటీ ఏర్పాటు చేసుకుని ఆయా సమస్యలు, అంశాలపై చర్చించుకునే వారమని గుర్తు చేశారు. అయితే సోము వీర్రాజు ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, అసలు కోర్ కమిటీ సమావేశాలే జరగడం లేదని అన్నారు. ఇందు వల్ల రాష్ట్ర శాఖలో ఏమి జరుగుతుందో పార్టీ నేతలకే తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. పొత్తు నుండి జనసేన తప్పుకుంటే అందుకు సోము వీర్రాజే బాధ్యులు అవుతారు అన్నట్లుగా మాట్లాడారు.

గతంలోనూ సోము వ్యవహారాల తీరుపై కొందరు పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తరుణంలోనే ఏక పక్ష నిర్ణయాలకు ఆస్కారం లేకుండా పార్టీ అధిష్టానం పలువురు నేతలతో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చే విషయంలో సోము వీర్రాజు తొలుత సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు. రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో గతంలో జరిగిన అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా బహిరంగంగా కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

YSRCP: ఎన్నికలు రేపు అన్నట్లుగా క్యాడర్ పని చేయాలని ఉద్భోదించిన వైసీపీ నేత, సీఎం వైఎస్ జగన్

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju