Raghuramakrishnamraju : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు, తదుపరి ఘటనలు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు రఘురామ కృష్ణంరాజుకు బెయిల్ కేటాయింపు విషయంలో సుప్రీం కోర్టులో తాజాగా విచారణ జరిగింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి మెడికల్ రిపోర్ట్ ఆధారంగా జరిగిన ఈ వాదనల సందర్భంగా లాయర్ సంచలన కామెంట్లు చేశారు.
సుప్రీంకోర్టు ఆ మాట చెప్పింది
తనను తీవ్రంగా కొట్టారని ఎంపీ రఘురామ కృషంరాజు చేసిన ఫిర్యాదు మేరకు రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ వైద్యపరీక్షలను వీడియో తీయాలని తుది నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం రఘురామకు కాలి వేలుకు ఫ్యాక్చర్ జరిగిందని సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో పాటుగా పలు ఇతర గాయాలు కూడా ఉన్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానం కామెంట్ల అనంతరం రఘురామ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ పోలీసులు కొట్టారనే మాట నిజమైందని అన్నారు.
లాయర్ సంచలన వ్యాఖ్యలు…
రఘురామ రాజు కాలిపై ఉన్న గాయమే ఆయన్ను పోలీసులు కొట్టారన్న దానికి నిదర్శనమని ఆయన తరుపు న్యాయవాది వ్యాఖ్యానించడంపై సీఐడీ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామ ఆ గాయాలు తనకు తానే చేసుకున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.