తెలంగాణ telangana రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ రాజకీయ నేతల విమర్శలు . అన్నింటికంటే ఇప్పుడు మరో ఎన్నికపై అందరి దృష్టి పడుతోంది . అదే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక nagarajuna sagar by election.
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య trs sitting mla nomula narsimhayya మృతితో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. దీంతో అన్ని పార్టీలు సాగర్ బై పోల్పై ఫోకస్ పెట్టాయి.. అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు వేట ప్రారంభించాయి. ఇదే సమయంలో ప్రధాన పార్టీలపై చర్చ మొదలైంది .
తెలంగాణ లో అందరి చూపు
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య nagarajuna sagar by election nomula narsimhayya కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగతి తెలిసిందే. ఈ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సాగర్లో రాజకీయ పరిస్థితిపై టీఆర్ఎస్ trs ఓ సర్వే నిర్వహించినట్లు తెలిసింది. పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై ఆరా తీసినట్లు సమాచారం.
బీజేపీ నయా గేమ్ ప్లాన్
దుబ్బాక, గ్రేటర్ dubbaka , greater Hyderabad election ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ bjp నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ bjp సాగర్ ఉప ఎన్నికపై సీరియస్ గా దృష్టి పెట్టింది. సాగర్లో పోటీచేయబోయే అభ్యర్థిపై కసరత్తు ప్రారంభించింది. అందుకు ఓ ఇంచార్జ్ ని కూడా నియమించింది. ఆ ప్రాంతంలో బీజేపీ అంతబలంగా లేక పోవడంతో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కమలనాథులు అనుకుంటున్నారని సమాచారం.
బీజేపీ స్థాయి ఏంటో ?
వాస్తవంగా బీజేపీ bjp నాగార్జునసాగర్ నియోజకవర్గం లో బలహీనంగా ఉంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే అక్కడ బీజేపీకి అంత పట్టులేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి bjp 3 వేల ఓట్లు కూడా రాలేదు. బలమైన క్యాడర్ కూడా లేదు.. అయినా అక్కడ సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ నేత గరికపాటి బీజేపీలో చేరడంతో సాగర్ కి చెందిన నేతలు కూడా బీజేపీ bjp తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితి మారిందని బీజేపీ bjp నేతలు అంటున్నారు. బూత్ స్థాయిలో క్యాడర్ని పటిష్టం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు .