ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ సమీకరణాలపై కొత్త చర్చ జరుగుతోంది . 2021లో ఏపీ సీఎం జగన్ పై నారా చంద్రబాబు కొత్త గేమ్ మొదలుపెట్టారని అంటున్నారు. వైఎస్ జగన్ పై జరుగుతున్న ఈ సంచలన కుట్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదంతా ఏపీలో జరుగుతున్న హిందూ దేవాలయాల ఘటనల గురించి .
ఏపీలో ఏం జరుగుతోంది ?
ఏపీలో ఆలయాల విధ్వంసానికి అడ్డుకట్టపడటం లేదని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో మర్లబండ ఆంజనేయస్వామి ఆలయంలోని గోపురంలోని సీతారాముల విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అంతేకాదు గుడి ముఖద్వారం ఇనుప కడ్డీలు కట్ చేసి హుండీని సైతం దొంగలించారు. సీతారాముల విగ్రహం కాళ్లను ధ్వంసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ ఫైర్….
ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారన్న ఆయన జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపాటి చర్యలు కూడా తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ఆలయ ఆస్తుల ధ్వంసానికి సర్కార్ బాధ్యత వహించాలన్న ఆయన ‘మూర్తీభవించిన ధర్మం శ్రీరామచంద్రుడు’ అంటూ మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడితో చెప్పాడు, త్రేతాయుగంలో ఒక రాక్షసుడు శ్రీరాముని గుణగణాలను ఉన్నతంగా చెబితే రాక్షస వారసులెవరో వర్తమానంలో ధర్మ విచ్ఛిన్నానికి ఒడిగట్టారని పవన్ పేర్కొన్నారు.
బాబు కుట్ర
అయితే, ఈ ఘటనలపై సోషల్ మీడియాలో సంచలన కామెంట్లు తెరమీదకు వస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు ఘటన తెరమీదకు వచ్చినపుడే కావాలని కొందరు ఇలాంటి ఘటనలను ప్రస్తావిస్తున్నారని అంటున్నారు. 2021లో ఏపీ సీఎం జగన్పై జరుగుతున్న కుట్ర ఇదని కామెంట్లు చేస్తున్నారు.