AP IAS Transfers: ఏపిలో అధికారుల బదిలీ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐఎఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరి కొందరు సీనియర్ అధికారులను బదిలీ చేసింది. ఇవేళ పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
సాంఘీక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జి జయలక్ష్మి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ గా రజిత్ భార్గవ బదిలీ అయ్యారు. పర్యాటక, సంస్కృతిక శాఖ అదనపు బాధ్యతలు కూడా రజిత్ భార్గవకు అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ గా అనంతరాము బాధ్యతలు నిర్వహించనున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఇంతియాజ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలను సీఎస్ పర్యవేక్షించనున్నారు.
రజినీకాంత్ పై వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా.. తనదైన బాణీలో కొడాలి