MLC Election : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. పిఆర్టీయు మద్దతుతో బరిలో ఉన్న గంధం నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీతో సాబ్జీ గెలుపొందారు. షేక్ సాబ్జీకి 7,983 ఓట్లు రాగా నారాయరావుకు 6,446 ఓట్లు వచ్చాయి. సెకండ్ రౌండ్ లెక్కింపుతోనే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే సాబ్జీ విజయం సాధించారు. అయితే సాబ్జీ విజయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాకినాడ జెఎన్టీయులో నేడు ఓట్ల లెక్కింపు నిర్వహించారు.
ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంలో 11 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ఈ నెల 14వ తేదీన పోలింగ్ జరిగింది.