Sharmila: తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలని చూస్తున్న వైఎస్ షర్మిల విషయంలో టీఆర్ఎస్ పార్టీ తన వ్యూహం మార్చిందని తెలుస్తోంది. నిరుద్యోగులు, వారి కుటుంబాలను పరామర్శించడం పేరుతో షర్మిల చేస్తున్న టూర్లపై టీఆర్ఎస్ ఇక కొత్త కార్యచరణతో ముందుకు సాగనుందని సమాచారం. ఈ మేరకు తాజాగా ఓ ఎమ్మెల్యే స్పందించిన తీరే ఉదాహరణ.
Read More: KCR: కేసీఆర్ భారీ కల… అడ్డం పడుతున్న కాంగ్రెస్ పార్టీ
షర్మిల టూర్లో అలా జరిగిందా?
ఉద్యోగం రాలేదని సూర్యపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పర్యటనలో నేరేడుచెర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి అనే అభ్యర్థి ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు షర్మిల వెళ్లారు. అయితే షర్మిల వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నా.. నీలకంఠం సాయి కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీంతో షాక్ తిన్న షర్మిల.. తాళం వేసిన సాయి ఇంటి ముందే నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే షర్మిల వస్తుందనే టీఆర్ఎస్ నేతలు సాయి కుటుంబాన్ని దాచిపెట్టారని షర్మిల అనుచరులు ఆరోపించడం సంచలనంగా మారింది.
Read More: Corona: గ్యాప్ ఇవ్వండి మహప్రభో…. దేశంలో ఇంకో కరోనా ఫంగస్….
ఎమ్మెల్యే ఫైర్
నిరుద్యోగి కనపడకుండా పోవడానికి కారణం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వారిని కిడ్నాప్ చేయించడమే అని షర్మిల వర్గం ఆరోపించడంపై హుజూర్నగర్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. నిరుద్యోగి కుటుంబం ఇంట్లో లేకపోతే దానికి తన పేరు చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంపై రాష్ట్రం ఏర్పడిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారన్న సైదిరెడ్డి.. మీరు ఉద్దరించేది ఇక్కడ ఏమి లేదని ఎద్దేవా చేశారు. షర్మిలమ్మ, మీ కుయుక్తులు, డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని హితవుపలికారు.