Shivratri Celebrations : ఉభయ తెలుగు రాష్ట్రాలలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఏపిలోని శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమలింగేశ్వరస్వామి దేవాలయం, మహానంది, కోటప్పకొండలోని త్రికూటేశ్వరస్వామి ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొంటున్నారు. ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు, పూర్ణాహుతి పూజలు నిర్వహిస్తున్నారు.
కృష్ణాజిల్లా గుడివాడ ఎన్ టిఆర్ స్టేడియంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంప్రదాయ దుస్తులతో పాల్గొన్నారు. అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో జగన్ పాల్గొని పండిత ఆశీర్వాదం స్వీకరించారు.
తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి దేవాలయం, కాశేశ్వరం రామప్ప ఆలయం తదితర శైవ ఆలయాలను పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేములపాడు రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. పలు ఆలయాల్లో విఐపీల దర్శనాల సందర్భంగా క్యూలైన్లలో భక్తులను ఎక్కువ సేవు నిలుపుదల చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరితగతిన దర్శనంకు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.