2020 మనకు మిగిల్చిన చేదు అనుభవాల లిస్ట్ రాయాలంటే భారీగా ఉంటుంది. దీనంతటికీ మూల కారణం కరోనా మహమ్మారి corona virus. అసలే కరోనా వైరస్ covid 19, కరోనా కొత్త స్ట్రెయిన్తో strain virus india భారత్ వణికిపోతుండగా 2021లో వ్యాక్సిన్ వచ్చి అంతా సర్దుకుంటుందని అనుకుంటున్న సమయంలో ఇంకో డేంజర్ వచ్చిపడింది !
బర్డ్ ప్లూ bird flu భయపెడుతోంది !!. బర్డ్ ఫ్లూ bird flu భయంతో నాలుగు రాష్ట్రాలే కాదు.. వాటి పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఆందోళన చెందుతున్నాయి. ఎంతగా అంటే కోళ్లకు వచ్చిన ఈ వ్యాధి కోళ్ల నుంచి వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కోళ్లు మాత్రమే కాకుండా ఇతర పక్షులు, చేపల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నది నిపుణుల మాట.
అసలేంటి బర్డ్ ఫ్లూ ?
బర్డ్ ప్లూ bird flu ఆందోళనకలిగించే వ్యాధి . ఈ వైరస్ కోళ్లకు సోకినప్పుడు రెండు రకాల లక్షణాలు కన్పిస్తాయి. ఈ వైరస్ తీవ్రత తక్కువగా ఉంటె.. కోళ్ల ఈకలు రాలిపోవడంతో పాటు, గుడ్డు ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అదే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే.. కోడి శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతిని 48 గంటలోపు మరణిస్తుంది. కోడి విసర్జన ద్వారా ఈ వ్యాధి ఒక దాని నుంచి మరొక కోడికి త్వరగా వ్యాప్తిచెందుతుంది. ఈ వైరస్ వ్యాప్తికి వివిధ పక్షులు వాహకాలుగా పనిచేస్తాయి.
మనకు సోకుతుందా?
ఔను. బర్డ్ ప్లూ పక్షుల నుంచి కూడా మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అయితే, ఇందులో మనుషులకు సోకే వైరస్లకు, కోళ్లకు సోకే వైరస్లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు హెచ్1ఎన్1, హెచ్1 ఎన్2, హెచ్3ఎన్2 వైరస్లు సోకుతాయి. కోళ్లకు హెచ్5ఎన్1 వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈ వైరస్ ప్రాణాంతకమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ , తెలంగాణలో టెన్షన్
హిమాచల్ ప్రదేశ్లో పక్షులు చనిపోవడంతో జమ్మూకశ్మీర్ కూడా అలర్ట్ అయింది. దీంతో వెంటనే వలస పక్షుల శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపించింది. అటు తమిళనాడు కూడా కేరళ బోర్డర్లో ఉన్న పక్షుల శాంపిల్స్ను పరీక్షలకు పంపింది. తమిళనాడు ఆనుకొని ఏపీ tamilnadu , ap , ఏపీ తెలంగాణ ap telangana మధ్య విస్తృత సరిహద్దు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది.