Akhila Priya : భూమా అఖిలప్రియ .. తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి కాస్త పరిచయం ఉన్న వారికి కూడా ఈ మహిళా నేత సుపరిచితం. ఇటీవల జరిగిన కిడ్నాప్ ఉదంతంలో ఆమె అరెస్టవడం, బెయిల్ పై విడుదల అవడం తెలిసిన సంగతే.
అయితే, బెయిల్ పై విడుదలైన అనంతరం సైలెంట్ గా ఉన్న భూమా అఖిలప్రియ తాజాగా సంచలనం రేపే కామెంట్లు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ తనపై దాడికి ప్రయత్నించారని చెబుతున్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ
ఏపీలో రచ్చ… ఆజ్యం పోసిన అఖిలప్రియ Akhila Priya
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల్లో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే సమయంలో అనేక ఘటనలు కాక రేపుతున్నాయి. రాజకీయ నేతల పర్యటనల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు.. పాలక, ప్రతిపక్షాలతో పాటు ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య చోటుచేసుకున్న పరిణామాలు చర్చగా మారుతున్నాయి. ఈ సమయంలోనే అఖిలప్రియ సంచలన కామెంట్లు చేశారు.
ఆళ్లగడ్డ పేరు చెప్పి….
ఏ ఎన్నికలైనా అరాచకాలతో గెలవాలనుకుంటే కుదరని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. భిన్నమైన ఆళ్లగడ్డ రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తాను ఎస్ లింగందిన్నె వెళ్తున్నానని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దాడి చేసేందుకు కాపు కాశారని.. తనపై దాడి చేస్తారని తెలిసి ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీంతో, వెంటనే పోలీసులు స్పందించి వారిని చెదరగొట్టారని భూమా అఖిలప్రియ వెల్లడించారు. దయచేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయవద్దని హితవుపలికారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై ఈ మహిళా నేత చేసిన కామెంట్లకు ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో మరి.