తెలుగుదేశం పార్టీ అధినేత, దేశ రాజకీయాల్లో తాను సీనియర్ అని ప్రకటించుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకోనున్నారా?
ఏకకాలంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఆయన రాజకీయ మిత్రుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకిచ్చే అడుగు వేయనున్నారా? అసలు అలాంటి నిర్ణయం తీసుకుంటారా? లేదా ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో బాబు రాజకీయం గురించి జరుగుతున్న చర్చ.
అసలేం జరుగుతోంది?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏపీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ. హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ పూర్తిగా ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన వివరాలను వెల్లడించారు. కిడ్నాప్ కి సంబంధించి మొత్తం స్కెచ్ అఖిలప్రియ వేశారని ప్రకటించారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ముగురు నిందితులను అరెస్ట్ చేశామన్న ఆయన వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వారిలో ఒకరు మల్లికార్జున్ రెడ్డి, మరొకరు బోయా సంపత్ కుమార్ (22) ఈయన భూమా అఖిల ప్రియ పర్సనల్ అస్సిటెంట్ అని, వీరు కాక బాలా చెన్నయ్య అనే డ్రైవర్ ని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
అఖిలప్రియ అదిరిపోయే ప్లాన్ ?
కిడ్నాప్ గురించి హైదరాబాద్ కమీషనర్ అంజనీ కుమార్ కీలక వివరాలు వెల్లడించారు. మల్లికార్జున్ రెడ్డి ద్వారాభూమా అఖిల ప్రియ రెడ్డి 6 సిమ్ కార్డులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. జనవరి 2వ తేదీన సిమ్ కార్డులు తీసుకున్నారని, వీటిలో ఒక సిమ్ కార్డు భూమా అఖిల ప్రియ ఉపయోగించిందని, మరికొన్ని సిమ్ కార్డు గుంటూరు శ్రీను ఉపయోగిండని పేర్కొన్నారు. కిడ్నాప్ కు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామన్న ఆయన 6 సిమ్ కార్డుల లొకేషన్స్, టవర్స్ లను గుర్తించామని అన్నారు. భూమా అఖిల ప్రియ ఇల్లు కూకట్ పల్లి లోని లోదా అపార్ట్మెంట్ ది అని గుర్తించామని అన్నారు. అఖిల ప్రియ ఆధ్వర్యంలో కిడ్నాప్ కు రెక్కీ నిర్వహించారని అన్నారు. లోధా అపార్ట్మెంట్ నుండి కిడ్నాప్ కు ప్లాన్ చేశారని, దానికి ఒక ఇనోవా, స్కార్పియో, ఒక టూ వీల్లర్ ను ఉపయోగించారని పేర్కొన్నారు. అఖిలప్రియ సమక్షంలోనే ఈ ఆపరేషన్ మొత్తం జరిగిందన్న ఆయన దానికి భార్గవ్ రామ్ కూడా సహకరించాడని పేర్కొన్నారు. ఇలా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పాత్ర స్పష్టంగా తేలిపోయిన నేపథ్యంలో త్వరలోనే ఆమెను తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు తీసుకోనున్నారని సమాచారం. తద్వారా అఖిలప్రియ అక్రమ మరకను పార్టీకి అంటకుండా చూస్తారని … ఇదే సమయంలో కేసీఆర్ , జగన్ తనను టార్గెట్ చేసుకోకుండా జాగ్రత్త పడతారని అంటున్నారు. ఇందులో నిజానిజాలు తేలాలంటే…. వేచి చూడాల్సిందే.