Akhila priya : అఖిలప్రియ షాకింగ్ నిర్ణయం .. అందుకే సైలెంట్ అయ్యారా? భూమా అఖిలప్రియ … టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి. గత కొద్దికాలంగా ఆమె వార్తల్లో నిలిచేందుకు కారణం బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టవడం. 18 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిలప్రియ చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.
అఖిలప్రియ జైలు నుంచి విడుదల అవుతుండటంతో ఆమె బంధువులు, అభిమానులు చంచల్గూడ జైలు వద్దకు చేరుకొని ఆమెను నివాసానికి తీసుకువెళ్లారు. అయితే, భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతారని ప్రకటించినప్పటికీ ఆమె ఇప్పటికీ సైలెంట్ గా ఉండటం గమనార్హం. అయితే, దీని వెనుక భారీ కారణం ఉందంటున్నారు.
akhila priya : అఖిలప్రియకు బెయిల్ విషయంలో….
సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టై షరతులతో కూడిన బెయిల్ పొందారు. ఈ కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ ప్రధాన నిందితురాలిగా ఉండగా ఆమె భర్త భార్గవ్ రామ్ ఏ-3గా ఉన్నారు. కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను సైతం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. మరోవైపు అఖిలప్రియకు రూ.10 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించి సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది. అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్లాలని కోర్టు ఆదేశించింది.
భూమా మౌనిక దూకుడు… అఖిల ప్రియ సైలెంట్
భూమా అఖిలప్రియ సోదరి మౌనిక కుటుంబం తరఫున దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టయిన తర్వాత కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ కార్యకర్తలతోభూమా మౌనిక సమావేశం నిర్వహించారు. అఖిలప్రియకు బెయిల్ వచ్చాక భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు తీసుకొస్తామని చెప్పారు. అయితే, విడుదల అయినప్పటికీ అలా చేయలేకపోయారు. కారణం అఖిలప్రియతో పాటుగా ఆమె భర్త భార్గవ రామ్, సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి పేర్లు కూడా ఈ కేసులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల ప్రియకే బెయిల్ దొరికింది. ఆమె భర్త, సోదరులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీరికి బెయిల్ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు మీడియాతో మాట్లాడిన అటు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన భర్త , సోదరుడి పరారీ గురించి వివరించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే అఖిలప్రియ సైలెంట్ అయిపోయారని అంటున్నారు.