ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు , ఓ ఆట ఆడుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది.
ఈ క్రమంలో తాజా అంశం దేవాలయాల కేంద్రంగా జరుగుతున్న ఘటనలు. అయితే, తాజాగా తెలుగుదేశం పార్టీ దూకుడు బ్రేక్ వేసేలా అధికార తెలుగుదేశం ఎత్తులు వేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో కూల్చివేయబడిన గుడులను పునర్మించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే షాక్…
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11:01 నిమిషాలకు ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి సీతమ్మవారిపాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయాల పునర్నిర్మాణం చేయనున్నారు. కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
ఒక్క విజయవాడలోనే….
విజయవాడలో పలు కీలక ఆలయాలను పునర్నిర్మాణం చేయనున్నారు. వాటి వివరాలివి.
♦️రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణం
♦️రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణం
♦️రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణం
♦️రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం
♦️రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణం
♦️రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల పునర్నిర్మాణం
♦️రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం(దుర్గగుడి మెట్ల వద్ద)
♦️రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయ పునర్నిర్మాణం
♦️రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం పునర్నిర్మాణం (పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో)