అభివృద్ధి – సంక్షేమ పథకాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పథకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి కూడా! తాజాగా ఏపీ సీఎం తీసుకున్న మరో సంచలన నిర్ణయం 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. ఈ పథకం ప్రారంభించిన రోజే ఏపీ ప్రజలకు సీఎం జగన్ ఓ షాక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
దేశంలోనే సంచలనం…
అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో ప్రారంభం అయింది. నమూనా ఇంటిని పరిశీలించిన సీఎం జగన్ కి ఇంటి నిర్మాణం తీరు, ఖర్చు వివరాలను అధికారులు వివరించారు . పేదలకు ఇచ్చే ఇంట్లోని సదుపాయాలు స్వయంగా పరిశీలించిన సీఎం జగన్, అనంతరం పేదలకు ఇళ్లు నిర్మాణం పైలాన్ ను ఆవిష్కరించారు. ఇవాళ నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ సాగనుంది. అయితే ఇదే రోజున ఏపీ సీఎం జగన్ ప్రజలకు షాక్ ఇచ్చారని అంటున్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది.
ఆ పథకాలతో జగన్ షాక్
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను యూనివర్సిటీలు, ప్రభుత్వ పీజీ కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది . 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈ రెండు పథకాలు ప్రభత్వ డిగ్రీ, పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్ కోటా లో అడ్మిషన్లు పొందిన వారికి మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కన్వీనర్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ , ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ రెండు పథకాలు వర్తించబోవని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది . 2020-21 విద్యా సంవత్సరంలో కొత్తగా నమోదైన అడ్మిషన్ల నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకుచర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ సీఎఫ్ఎస్ ఎస్ సీఈఓకు సూచనలు జారీ అయ్యాయి. దీంతో అ విభాగాల్లో సీట్లు పొందేవారు నిరుత్సాహపడటం ఖాయమని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?