Atchanaidu : ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ అచ్చెన్నాయుడు అరెస్ట్ . ysrcp వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా అచ్చెన్నాయుడు బెదిరించాడని ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశారు.
అయితే , ఈ విషయంలో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో గతంలో జరిగిన పలు ఘటనలే ఇవాళ అచ్చెన్నాయుడు ఇలా కష్టాలు పడేందుకు కారణమట. ఈ విషయాన్ని చెప్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులే.
Atchanaidu : అసలేం జరిగింది ?
శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ పదవికి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడు నామినేషన్ వేయగా ఆయన సమీప బంధువు వైసీపీ తరఫున బరిలో దిగాలని భావించడంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో బెదిరింపుల కేసు నమోదు అయ్యింది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన కోటబొమ్మాలి పోలీసులు.. కోర్టులో హాజరుపర్చారు. అచ్చెన్నాయుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది .
జగన్ విషయంలో అలా చేసినందుకే…
అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులకు పనిలేకుండా పోయింది.. ఇప్పుడు అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం తిరిగి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెనుక అండగా ఉందని అక్రమ కేసులు పెడితే చివరికి బాధ్యులయ్యేది పోలీసులే అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ దర్యాప్తునకు ఎర్రన్నాయుడు వేసిన కేసే కారణమని ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.