ఏపీ లో ఇప్పుడు హాట్ టాపిక్ పార్టీల విమర్శల కంటే నాయకుల విమర్శలు అనడం కరెక్ట్ . జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల పర్వంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మారిపోయింది. జనసేనాని ఒక మాట అంటే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా అది మూడో రోజు కొనసాగింది.
కొడాలి నాని ….. ఫుల్ స్వింగ్
సీఎం వైఎస్ జగన్ను ఒక్క మాట అంటే మేం పది అంటాం అంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.. నోటికి వచ్చినట్లు పవన్ కల్యాణ్ మాట్లాడొద్దు అంటూ హితవు పలికారు. పవన్ కల్యాణ్ ఏమనుకుంటున్నావ్ డోంట్ కేర్ అంటూ తంతే పవన్ వెళ్లి పక్కదేశంలో పడతాడు అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ వార్నింగ్లు ఇవ్వడమేంటి? అంటే ప్రశ్నించిన కొడాలి… భయపడేది లేదు అంటూ తేల్చిచెప్పారు. భయపడడానికి ఇది సినిమా కాదు అంటూ వార్నింగ్ ఇచ్చిన కొడాలి… చంద్రబాబుకు ఆపద వస్తే పవన్ వచ్చేస్తాడని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు, పవన్ కలిసినా ఏం చేయలేరు అని కామెంట్ చేసిన ఆయన.. తన కోసం తప్ప పవన్ రైతుల గురించి మాట్లాడడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు స్ర్కిప్ట్ ఇస్తే పవన్ చదువుతున్నాడని విమర్శించిన ఆయన.. ప్యాకేజీ తీసుకుని పవన్ మాట్లాడతాడు అంటూ ఆరోపించారు.
జనసేన సైతం తక్కువ తినలేదు…
మరోవైపు జనసేన సైతం జగన్ టీంపై అదే రీతిలో విరుచుకుపడింది. విజయవాడలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేస్తే దానిపై చర్చ లేకుండా పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం, మంత్రి పదవి కోసం ఆరాట పడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడుకు, కొడాలి నానికి ఏదో సంబంధం ఉందని …. ప్రజలు చంద్రబాబు ను ఓడించినా.. నాని ఆయన్ని మరచిపోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. కొడాలి నాని చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నట్లే అందరూ అలాగే చేస్తారని అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.