తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా పేరొందిన రేవంత్ రెడ్డి కి గడ్డు కాలం ఎదురవుతోందా? ఆయనపై అనుచరులు ఓ రేంజ్లో ఆశలు పెట్టుకుంటుంటే పరిస్థితులు మాత్రం తేడా కొడుతున్నాయా? తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనమా? …. ఇవన్నీ రేవంత్ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్లు .
అసలేం జరిగింది?
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిలో దీర్ఘకాలం కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి గుడ్ బై చెప్పేయడంతో కొత్త నేత ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో సహజంగానే ఢిల్లీ పెద్దలు కొత్త నాయకుడిపై దృష్టిపెట్టారు. పీసీసీ ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది . పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి రావడం … ఇవాళో.. రేపో అధికారికంగా ప్రకటన చేస్తుందన్న సమయంలో.. ఉన్నట్టుండి కీలక ప్రకటన వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికమ్ ఠాగూర్.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, పీసీసీ నియామకాన్ని వాయిదా వేసుకోవాలన్న సీనియర్ నాయకుడు జానారెడ్డి విజ్ఞప్తిని సోనియా గాంధీ ఆమోదించారని తెలిపారు..
జానారెడ్డి కోరారు… సోనియాగాంధీ విన్నారు…
పీసీసీ ఎంపికపై జరుగుతోన్న ప్రచారంపై ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి రావడం మీడియా సృష్టి మాత్రమే అన్నారు.. సంప్రదింపుల ప్రకియ ఇంకా పూర్తి కాలేదని…నాగార్జునసాగర్ ఉపఎన్నికల తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తిస్థాయి జట్టును ప్రకటిస్తామని . పిసిసి, ప్రచార కమిటీతో సహా అన్ని కమిటీలు ఉంటాయని వెల్లడించారు. నాగార్జున సాగర్ ఎన్నికలు కీలకం.. మేం ఖచ్చితంగా గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేశారు ఠాగూర్.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దీటైన ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించబోతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ పరిణామాలు రేవంత్ రెడ్డికి ఉన్న పట్టును తేటతెల్లం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు కామెంట్ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?