SHREE CEMENTS: ఏపికి మరో భారీ పరిశ్రమ రానుంది. ఇప్పటికే పలు దేశీ, విదేశీ కంపెనీలు ఏపిలో పెట్టుబడులు పెడుతుండగా, తాజాగా శ్రీ సిమెంట్స్ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు లో రూ.2500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు శ్రీసిమెంట్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించి ప్లాంట్ లు ఏర్పాటు చేసిన శ్రీ సిమెంట్ గ్రూపు.. ఏపిలో తమ మొట్టమొదటి ప్రాజెక్టు ప్రారంభించబోతున్నది. గత ఏడాది డిసెంబర్ నెలలోనే ఆ సంస్థ ఎండీ హెచ్ఎం బంగూర్, జీఎండీ ప్రశాంత్ బంగూర్ లు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై చర్చించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పారిశ్రామిక వర్గాలకు ఏపి సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహకాలపై సీఎం జగన్ ఆ సందర్భంలో వివరించారు. సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాల పట్ల కంపెనీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం ఆకాంక్ష మేరకు ఏపిలో పరిశ్రమ ఏర్పాటునకు ఎండీ హెచ్ఎం బంగూర్ ముందుకు వచ్చారు. రీసెంట్ గా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో దాచేపల్లి మండలం పెదగార్లపాడు లో ప్లాంట్ ఏర్పాటునకు ఆమోదం తెలిపారు. ప్లాంట్ ను 24 నెలల్లో పూర్తి చేసేలా కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Read More: AP CM YS Jagan: 23న సీఎం జగన్ తిరుపతి, శ్రీకాళహస్తిలో పర్యటన .. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన..
కాగా మరో పక్క ఎల్లుండి శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద రూ.700కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న అపాచి పాదరక్షల తయారీ పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయడంతో పాటు తిరుపతి రూరల్ లో టీసిఎల్ పరిశ్రమకు సంబంధించి అనుబంధ యూనిట్లకు ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాలను చేయనున్నారు.