NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravathi: పట్టు రైతులకు ప్రోత్సాహక బకాయిలు మంజూరు చేయాలి

Share

Amaravathi: పట్టురైతులకు ప్రభుత్వం అందించాల్సిన ప్రోత్సాహక బకాయిలు రూ.50కోట్లు వెంటనే అందించి ఆదుకోవాలని పట్టు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. అమరావతి క్యాంప్ కార్యాలయంలో సజ్జలను కలిసిన పట్టు రైతుల సంఘం నాయకులు సిద్దారెడ్డి, పరిగి రాజేశ్, మడకశిర రామకృష్ణారెడ్డి, శంకర లు మాట్లాడుతూ..2019 నుండి నేటి వరకూ చెల్లించాల్సిన ప్రోత్సాహక మొత్తం రేషంషెడ్లు, రోగ నిరోధక మందులు, పరికరాలు, మొక్కలకు అందించాల్సిన రాయితీ మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు.

silk farmer leaders met sajjala

 

హిందూపురంలోని మార్కెట్ భవనాన్ని పునఃనిర్మాణం చేయాలనీ, పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కమిషనర్ ను నియమించాలని కోరారు. ఈ విషయాలపై సజ్జల సానుకూలంగా స్పందించారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.


Share

Related posts

Corona: క‌రోనా టైంలో ఒక్కొక్క‌రుగా మోడీని భ‌లే బుక్ చేస్తున్నారుగా

sridhar

Congress Presidential Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్ .. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సోనియా గాంధీ ఇతర నేతలు

somaraju sharma

అస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌‌కు యూకే అనుమతి

somaraju sharma