Corona: ఇప్పటికే కరోనా కలకలానికి తోడుగా బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులు నమోదవుతుండటం అనేక వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యలకు పరిష్కారం కోసం వైద్య వర్గాలు తమ వంతు కృషి చేస్తున్న సమయంలో తాజాగా మరో ఫంగస్ వెలుగు చూసింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు ఉన్న బ్లాక్ , వైట్ ఫంగస్లకు తోడుగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో స్కిన్ బ్లాక్ ఫంగస్ మొదటి కేసు కర్ణాటకలోని చిత్రదుర్గలో నమోదవగా.. ఒక్కసారిగా కలకలం సృష్టించింది.
Read More: Black fungus: షాక్ః కరోనా రాకపోయినా… బ్లాక్ ఫంగస్ ముప్పు మనకు ఉంటుందట
కర్ణాటకలో కలకలం..
కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన 54 ఏళ్ల రోగికి స్కిన్ మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. నెల క్రితం కరోనా వైరస్ నుంచి కోలుకున్న బాధితుడి చర్మంపై బ్లాక్ ఫంగస్ కనిపించిందని వైద్యులు తెలిపారు. బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్ ఫంగస్ కనిపించిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్ ఫంగస్ను తొలగించగా.. ఇప్పుడు రెండో దశ శస్త్ర చికిత్సకు సిద్ధమవుతున్నట్లు వైద్యులు వివరించారు. బాధితుడికి మధుమేహం కూడా ఉందని వివరించారు.
Read More: Corona: షాక్ఃకరోనా టీకా పనిచేయడం లేదని కేసు పెట్టాడు
తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ విషయంలో ఏం జరుగుతోందంటే…
ఇదిలాఉండగా, తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స విషయంలో రెండు రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇటు హైదరాబాద్ అటు వరంగల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా వైద్యులను నియమించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ ఫంగస్ను ఆరోగ్య శ్రీలో చేర్చి చికిత్స అందిస్తోంది.