social Media; ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అధికం అవుతున్న సంగతి తెలిసిందే. కంప్యూటర్ లను హాక్ చేయడం, డేటాను సత్కరించడం, సోషల్ మీడియా అకౌంట్ లలోకి జొరబడటం జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఏపి పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ ఖాతాను హాక్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మంత్రి ట్విట్టర్ ఖాతా నుండి కొందరు హాకర్లు అశ్లీల చిత్రాలు పోస్టు చేయడం కలకలాన్ని రేపింది.
తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని తెలుసుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి..ట్విట్టర్ సంస్థతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ట్విట్టర్ ఖాతా నుండి అశ్లీల చిత్రాలు కనబడినందుకు ఆయన తన ఫాలోవర్లకు క్షమాపణలు తెలియజేశారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో వచ్చిన అశ్లీల చిత్రాలను సిబ్బంది తొలగించారు.
సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రుల వంటి ప్రముఖుల ఖాతాలనే హాక్ చేస్తుంటే సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.