Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి భీమవరంకు ప్రధాని మోడీ, సీఎం జగన్ వెళుతుండగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డజన్ల కొద్దీ ఎయిర్ బెలూన్లను గాల్లోకి వదిలారు. విమానాశ్రయం వద్ద నిరసన తెలియజేయాడిని నల్లబెలూన్లతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నేత సుంకర పద్మశ్రీని పోలీసులు అడ్డుకున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బెలూన్లను పోలీసులు పగులగొట్టి ఆమెను అక్కడ నుండి ఒక ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీసు జీపు లేకపోవడంతో అటుగా వెళుతున్న ఆటోను నిలుపుదల చేసి ఆటోలో ఉన్న వృద్ధులను దింపేసి సుంకర పద్మశీని ఆ ఆటోలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. పోలీసుల ఈ చర్య విమర్శలకు దారి తీసింది. మరో పక్క ఎంఆర్ పీఎస్ ఆధ్వర్యంలోనూ ఎయిర్ పోర్టు వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాాగా నల్ల బెలూన్లను ఎగురవేయడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. కొన్ని దుష్ట శక్తులు బెలూన్లను ఎగురవేశాయని మండిపడ్డారు. నల్ల బెలూన్లు గాల్లోకి పంపడం ద్వారా భారీ కుట్రకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిిపి దుష్ట శక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు.