Somu Veerraju: కేంద్రంలోని బీజేపీ సర్కార్ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ బకాయిలను విడుదల చేయడం లేదు. తెలంగాణ, ఏపి మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లోనూ రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ లేవు. ఏపిపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతుందన్న విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఎప్పుడో ప్రకటించాల్సింది ఇంత వరకూ లేదు. ఇది ఇలా ఉంటే ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపికి త్వరలో రైల్వే జోన్ అంటూ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More: Somu Veerraju: నచ్చినప్పుడు చంద్రబాబు లవ్ చేస్తాడు.. తర్వాత బ్రేకప్ చెబుతాడు అంటూ సోము సెటైర్లు..!!
Somu Veerraju: త్వరలోనే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్
త్వరలోనే విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ వస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు. దీనిపై కేంద్రంలోని పెద్దలు మాత్రం ఇంత వరకూ అధికారికంగా ప్రకటన చేయాలేదు. సోము వీర్రాజు చెప్పినట్లు కొత్త రైల్వే జోన్ వస్తే సంతోషమేమరి. కేంద్రం ఏమంటుందో చూడాలి. ఇక ఇదే సందర్భంలో ఏపిలోని వైసీపీ సర్కార్ పనీ తీరుపై మరో మారు విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు. ఏపి ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారీగా నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పనులకు వాడకుండా దారి మళ్లిస్తోందంటూ మరో సారి ఆరోపణలు చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులను ఆయా ఖాతాలకు పంపించాల్సి ఉండగా అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నా రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ నిర్లక్ష్యం చూపుతోందంటూ జగన్ సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు సోము వీర్రాజు.
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి
ఇదే సందర్బంలో సోము వీర్రాజు జిల్లాల పునర్విభజనపైనా స్పందించారు. ప్రజాభీష్టం మేరకు జిల్లాల విభజన జరగాలని సోము వీర్రాజు అన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా వారి సౌలభ్యం మేరకు జిల్లాలను విభజించే ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటుందని అన్నారు. ప్రజల డిమాండ్ల ను పరిశీలన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు సూచించారు.