ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో భేటీ అయ్యారు. పవన్ నివాసంలో ఇద్దరు దాదాపు అరగంట పాటు మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కువగా వీరిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు అన్నదానిపై జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు రెండు పార్టీల నేతలు స్పష్టం చేయడం అందరికీ తెలిసిందే.
కాగా భేటీ అనంతరం బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రెండు పార్టీలు సంయుక్తంగా కలసి పోటీ చేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకుగాను తిరుపతి ఉప ఎన్నిక పునాది కానుందని చెప్పుకొచ్చారు. ఈ గ్రామము లో జరగబోయే ఉప ఎన్నికల్లో రెండు పార్టీల నేతలు సమన్వయం లోపం లేకుండా పని చేయడానికి రెడీ అవుతున్నట్లు కుల, మత, వర్గ భేదాలు పట్టించుకోకుండా కలిసి పని చేయడానికి రెడీ అయినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే సడన్ గా సోము వీర్రాజు పవన్ తో భేటీ వెనకాల పెద్ద కారణమే ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తిరుపతిలో ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటించిన క్రమంలో రాష్ట్ర బీజేపీ మరియు జనసేన పార్టీ ల మధ్య కొద్దిగా గ్యాప్ ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలకు.. ఉన్న గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికే ఈ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?