somu verraju : ఏపీ బీజేపీ రథసారథి సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రజల మనోభావాలకు సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కొనసాగిస్తున్న సంచలన వ్యాఖ్యల పరంపర ఇతర పార్టీల నేతలనే కాకుండా విశాఖ ఉక్కుపై ఆధారపడిన వారిని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
తాజాగా ఆలయాలపై దాడుల విషయంలో సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎపిసోడ్ను సైతం కలిపారు.
somu verraju వీర్రాజు ఏమన్నారంటే….
వైసీపీ, టీడీపీ కుమ్మక్కు అయ్యాయని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడుల అంశం నుంచి దృష్టి మరల్చేందుకే.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని టీడీపీ, వైసీపీ తెరపైకి తెచ్చాయని ఆరోపణలు చేశారు . స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు సోమువీర్రాజు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర మంత్రి ఒక్క ప్రకటన చేయలేదని.. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, మరి ఉద్యమం ఎందుకు ? అని సోమువీర్రాజు ప్రశ్నించారు. ఆలయాలపై దాడుల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. ప్రభుత్వం టీడీపీతో చేతులు కలిపి బీజేపీని ఏకాకిని చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాని నాని వచ్చేశారుగా….
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలను ఆ పార్టీ కార్యకర్తలే పట్టించుకోరని ఎద్దేవా చేశారు.. సోము వీర్రాజు మా మీద ఆరోపణలు చేసే బదులు కేంద్రంతో ఒక్క స్టేట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేసిన కొడాలి నాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించటం లేదని… కేంద్రంతో సోము వీర్రాజు చెప్పించాలని కొడాలి కోరారు. మరి కొడాలి కామెంట్లకు వీర్రాజు ఎలా స్పందిస్తారో!