Somu verraju : బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన స్టీల్ ప్లాంట్ ను ఉద్దేశిస్తూ ఆయన ఒకింత సెటైరికల్గా మాట్లాడారని అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతుండా వీర్రాజు ఇలా మాట్లాడటం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.
Somu verraju ఏం జరుగుతుందో తెలుసు కదా సర్…
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తున్న నేపథ్యంలో, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ బీజేపీ చీఫ్ వీర్రాజు సైతం ఢిల్లీ వెళ్లి ప్లాంటు ప్రైవేటీకరణ జరగకుండా తన వంతు ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తి తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని చంద్రబాబు , కమ్యూనిస్టులు మాత్రమే చెబుతున్నారని ఆయన అన్నారు.
బీజేపీ ని వ్యతిరేకించాలని ఉద్దేశంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్నారని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. మరి ఏ ప్రకటన రానప్పుడు వీర్రాజు ఎందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్ కీలక ప్రకటన…
విశాఖలో పర్యటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్మిక సంఘాల నాయకులతో చర్చించిన ఆయన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తామన్నారు. అసెంబ్లీ బడ్జెట్సమావేశాల్లో తీర్మానం పెడతామని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో విశాఖ ప్లాంటుకు సొంతంగా గని కేటాయించాలని, ఆ రాష్ట్రంలో పుష్కలంగా ఇనుపఖనిజం నిల్వలు ఉన్నాయని చెప్పామని గుర్తుచేసుకున్నారు. మనం ప్రయత్నాలు చేసి ఈ గనులనుంచి ఖనిజాన్ని పొందేలా లీజులను పునరుద్ధరణ చేసుకోవాల్సిన అసరం ఉందన్నారు..
కార్మికుల ఆందోళనల వల్ల ప్లాంటు మూతబడింది, ఉత్పత్తి సరిగ్గా జరగడంలేదన్న మాట అవతలివాళ్ల నుంచి రానీయకుండా చూసుకోండి అని సూచించిన ఆయన.. విరామం సమయంలో మాత్రమే ధర్నాలు, ఆందోళనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో ఒక సానుకూలమైన నిర్ణయం వస్తుందని గట్టిగా నేను నమ్ముతున్నానని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?