NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Sonia Gandhi : సోనియమ్మా…. ఇండియ‌న్ల మ‌న‌సు గెలిచావ‌మ్మ

Sonia Gandhi : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మ‌రోమారు భార‌తీయ రాజ‌కీయాల్లో తాను ఎంత క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది నిరూపించుకున్నారు. దేశ‌మంతా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశంలో ఆమె కీల‌క అడుగు వేశారు.

Sonia Gandhi
Sonia Gandhi

గ‌త కొద్దికాలంగా సామాన్యుల‌కు షాక్ లు ఇస్తున్న పెట్రోల్ ధ‌ర‌ల‌పై సోనియాగాంధీ త‌న‌దైన శైలిలో రియాక్ట‌య్యారు. ప్రజలను ఇబ్బందులపాలు చేసి కేంద్ర ప్రభుత్వం లాభపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని తప్పుబట్టారు. ఈ మేర‌కు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

Sonia Gandhi మ‌ధ్య త‌ర‌గతి మ‌న‌సులు గెలిచావ‌మ్మ‌…

మధ్య తరగతి, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోనియాగాంధీ ఈ లేఖ‌లో వివ‌రించారు. దేశంలో ఎప్పుడూ లేని స్థాయికి చమురు ధరలు చేరాయని కాంగ్రెస్ అధినేత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిరంతరం పెరగటాన్ని ఆమె తప్పుబట్టారు. క‌రోనా కారణంగా దిగిజారిన ఆర్థిక వ్యవస్థతో ఓవైపు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, కుటుంబ ఆదాయాలు, వేతనాలు తగ్గిపోతున్నాయని.. మధ్య తరగతి ప్రజలు, మన సమాజంలో అణగారిన వర్గాలవారు తీవ్ర ఇబ్బందులను అనుభవిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు .. ఈ సమస్యలకు తోడు ద్రవ్యోల్బణం, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు, ఇబ్బందుల నుంచి లాభాలు పిండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.

వంట‌గ్యాస్ ధ‌ర‌ల గురించి సైతం …

వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటంపై కూడా సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.800కు చేరిందని, ఇది చాలా క్రూరమైన విధానమని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్‌పై మితిమీరిన ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి సర్కార్ అమితోత్సాహం ప్రదర్శిస్తోందని సోనియాగాంధీ దుయ్యబట్టారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను ప‌ట్టించుకోకుండా మోడీ ప‌రిపాల‌న సాగుతోంద‌ని ఆక్షేపించారు. కాగా, ఇప్పుడు పార్టీల‌తో సంబంధం లేకుండా దేశంలోని అన్ని వ‌ర్గాలు పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల‌పై భ‌గ్గుమంటున్న స‌మ‌యంలో సోనియాగాంధీ రాసిన లేఖ భార‌తీయుల హృద‌యాల‌ను గెలుచుకునే విధంగా ఉంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

author avatar
sridhar

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk