Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్ నేడు ఏపికి వస్తున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ నగరానికి రానున్నారు. గతంలో బాలీవుడ్ నటుడుగానే అభిమానులకు తెలిసిన సోనూ సూద్ ..కరోనా మహమ్మారి విజృంభించిన నాటి నుండి ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా రియల్ హీరోగా గుర్తింపు పొందారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచాడు సోనూ సూద్, విద్య, వైద్యం, ఉపాధి ఇలా అనేక రకాలుగా సేవలు అందించారు సోనూ సూద్, కరోనా సెకండ్ వేవ్ సమయంలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలెండర్ లను సప్లై చేశారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం సోనూ సూద్ తన భుజస్తందాలపై వేసుకుని చేశారు. అపర దాన కర్ణుడుగా కీర్తించబడుతున్నారు.
ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. సోనూ సూద్ గురించి చిన్న అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో సెన్ఫేషనల్ అవుతుంది. సోనూ సూద్ నుండి సాయం అందిన వారు ఆయనను దేవుడిగా కొలుస్తున్నారు. గుళ్లు కట్టి పూజలు చేశారు. ఆయన పేరుతో అభిమానులు స్టాల్స్ ను ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా దేశ వ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు సోను సూద్.
నేడు సోనూ సూద్ విజయవాడ నగరానికి విచ్చేస్తున్నారని తెలియడంతో అభిమానులు ఆయనను నేరుగా చూసేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. ముందుగా సోను సూద్ బుధవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 9వ తేదీ గురువారం ఉదయం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని తిరిగు ప్రయాణం అవుతారు. నేటి సాయంత్రం దుర్గమ్మ దర్శనానికి సోను సూద్ వస్తున్నారని సమాచారం అందడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోను సూద్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రానున్నారు.
Read More:
1.AP Govt: ఇది జగన్ సర్కార్ కు భారీ ఊరట..! హస్తినలో మంత్రి బుగ్గన ప్రయత్నాలు ఫలించినట్లే..!!
2.Ganesh Festival: విఘ్నాధిపతి వేడుకలకే విఘ్నాలు..! గవర్నర్ జీ ఏమి చేస్తారో..?
3.Jagananna Vidya Deevena: ఆ అంశాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లే..!!