Sri Satya Sai Dist: శ్రీసత్యసాయి జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో అయిదుగురు వ్యవసాయ కూలీలు సజీవ దహనం కాగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పారిస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించారు. సీఎంఒ ద్వారా ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఈ ఉదయం ఆటో పై విద్యుత్ వైర్లు తెగి పడటంతో అయిదుగురు మహిళా వ్యవసాయ కూలీలు సజీవ దహనం అవ్వగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోటకు చెందిన కుమారి ఉన్నారు. కాగా ప్రమాద ఘటనపై ఏపిఎస్పిడీసిఎల్ సీఎండి హరినాథరావు స్పందిస్తూ..మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.2లక్షల వంతున ఆర్దిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కరెంటు వైర్ ను ఎర్త్ వైర్ ను ఉడత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖపరమైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అనంతపురం ఎస్ఇతో పూర్తి విచారణకు ఆదేశించామని తెలిపారు.