SSC Inter Exams 2022: ఏపిలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు
SSC Inter Exams 2022: మే 2 నుండి పదవ తరగతి పరీక్షలు
పదవ తరగతి పరీక్షలను మే 2వ తేదీ నుండి మే 13వ తేదీ వరకూ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొత్తం 6,39,805 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకూ పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 8 నుండి ఇంటర్ పరీక్షలు
మార్చి 11 నుండి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 1456 సెంటర్ లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,05,052 మంది విద్యార్ధులు, రెండో సంవత్సరం పరీక్షలకు 4,81,481 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని చెప్పారు. మొత్తం 9,86,533 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారని తెలిపారు.