Stalin: అంచనాలు తలకిందులు చేస్తూ తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకేను ఒంటి చేత్తో భారీ ఆధిక్యంతో గెలిపించి సీఎం పీఠం అధిరోహించిన ఎంకే స్టాలిన్ పరిపాలనలో తన ముద్ర వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అమ్మ క్యాంటీన్లలో జయలలిత బొమ్మ కొనసాగింపు మొదలుకొని కరోనా కల్లోలాన్ని చక్కదిద్దేందుకు విపక్ష నేతలతో కలిసి కమిటీ వేయడం వరకూ స్టాలిన్ నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కరోనాతో అనాథలైన పిల్లల కోసం సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే , దీనిపై వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి
Read More : Harish Rao: హరీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయినట్లేనా?
కరోనా బాధిత చిన్నారులకు భారీ తీపికబురు
కరోనా తో తమ తల్లిదండ్రులు, సంరక్షలను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించారు. సదరు పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఎంకే స్టాలిన్ తెలిపారు. ఈ చిన్నారుల విద్యకు సంబంధించి స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా , వసతి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఆ చిన్నారులకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల రూ.3 వేలు భత్యం రూపంలో ఇస్తామని ప్రకటించారు. కోవిడ్తో అనాథలైన చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ఎంకే స్టాలిన్ చెప్పారు.
Read More : Lock down: గుడ్ న్యూస్ః పక్క రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు
స్టాలిన్ సంచలన నిర్ణయాలు…
తమిళనాడు ఎన్నికల సమయంలో 500 లకు పైగా హామీలతో కూడిన మ్యానిఫెస్టోను డీఎంకే పార్టీ రూపొందించింది. ఆ భారీ హామీల్లో ముఖ్యమైనవి ముందుగా అమలు చేసేందుకు కొత్తగా కొలువుదీరిన స్టాలిన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత స్టాలిన్ మూడు దస్త్రాలపై సంతకాలు చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు కలిగిన 2.07 కోట్ల కుటుంబాలకు రూ.4వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే ఫైల్ మరొకటి. వీటితో పాటుగా రాష్ట్రంలో లీటర్ పాలపై రూ.3 తగ్గింపుకు సంబంధించిన ఫైల్ పై కూడా స్టాలిన్ సంతకం చేశారు. ఇలా సంచలన నిర్ణయాలతో స్టాలిన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.