Supreme Court: అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉందని భావించారు. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, దీనికి వ్యతిరేకంగా రైతులు దాఖలు కేవియట్ పిటిషన్లు, మూడు రాజధానులను సమర్దిస్తూ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు శుక్రవారం జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. అయితే బెంచ్ కార్యకలాపాలు ముగియడంతో రైతుల తరపు న్యాయవాది వికాస్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టాలని ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి పట్టుబట్టాబట్టగా.. అంత అత్యవసరమని భావిస్తే మార్చి 3న ఏపీ హైకోర్టు తీర్పు ఇస్తే ప్రభుత్వం సెప్టెంబర్ లో సుప్రీంకు ఎందుకు పచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. అమరావతి కేసును పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి మరి కొంత సమయం పడుతుందని జస్టిస్ కేఎం జోసఫ్ పేర్కొన్నారు. కేసుపై క్లుప్తంగా నోట్ ఇస్తానని రైతుల తరపు సీనియర్ న్యాయవాది పాలి నారిమన్ తెలిపారు. దీనికి జస్టిస్ జోసఫ్ అంగీకరించారు. త్వరితగతిన విచారించాలన్న ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, రైతుల పిటిషన్లు ఈ నెల 1వ తేదీ విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ల విచారణ ధర్మాసనం నుండి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ తప్పుకుని వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. గతంలో ఏపి ప్రభుత్వానికి అభిప్రాయాన్ని తెలియజేశారన్న విషయాన్ని రైతుల తరపు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ దృష్టికి తీసుకువెళ్లగా, నాట్ బిఫోర్ మీ అంటూ తప్పుకున్న సంగతి తెలిసిందే. సీజేఐ అదేశాలతో రిజిస్ట్రీ అమరావతికి సంబంధించిన పిటిషన్లను జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ తో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసింది. శుక్రవారం వాదనలు జరగకుండానే అమరావతి వ్యవహారం వాయిదా పడింది. ఏపి హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఏపి ప్రభుత్వం పిటిషన్ లో కోరిన సంగతి తెలిసిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?