Supreme Court: రాష్ట్రాల విభజన వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపి విభజన విషయంలో తప్పులు జరిగాయనీ, నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలంటూ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. విభజన పక్రియ సక్రమంగా జరగలేదని కోర్టును ఆశ్రయించారు. విభజన పక్రియ పూర్తి అయినందున భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలని ఉండవల్లి సవరణ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణకు అంగీకరించింది.
Supreme Court: త్వరితగతిన విచారణకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అంగీకారం
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్..ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్ గురించి సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. పిటిషన్ దాఖలు చేసి చాలా కాలం అయ్యిందని పేర్కొంటూ ఏపి విభజన అంశంపై ప్రధాన మంత్రి వ్యాఖ్యలను సైతం కోర్టులో ప్రస్తావించారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలను పరిగణలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ త్వరితగతిన విచారణకు అంగీకారం తెలిపారు. వచ్చే వారంలో లిస్ట్ లో పొందుపరిచేలా చూడాలని రిజిస్ట్రీని సీజేఐ ఆదేశించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?