NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ..! సిీబీఐ దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతి..!!

Supreme Court big Shock to ap minister Adimulapu Suresh

Adimulapu Suresh: ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులు. ఆదిమూలపు సురేష్ 2009 లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కల్గి ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు 2016 లో దేశ వ్యాప్తంగా పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆదిమూలపు సురేష్ సతీమణి విజయలక్ష్మి పై 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయలక్ష్మిని ప్రధాన నిందితుడిగా, ఆదిమూలపు సురేష్ ను రెండవ నిందితుడుగా సీీబీఐ పేర్కొంది.

Supreme Court big Shock to ap minister Adimulapu Suresh
Supreme Court big Shock to ap minister Adimulapu Suresh

Adimulapu Suresh: హైకోర్టు ఉత్తర్వులను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు

అయితే తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాధమిక విచారణ జరపలేదనీ, దీనిని కొట్టి వేయాలని కోరుతూ సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కుమారి, విచారణ జరిపింది. ప్రాధమిక విచారణ చేపట్టకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న పిటిషనర్స్ వాదనలను దృవీకరిస్తూ హైకోర్టు.. సీబీఐ ఆరోపణలను తోసి పుచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో లోపాలు ఉన్నందున మరో సారి ప్రాధమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అన్ని అధారాలతోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

 

సీీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గత నెల 22న సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. నాడు తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం నేడు తుది తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం తోసి పుచ్చింది. ప్రాధమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి అనుమతి జారీ చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సుప్రీం కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!