Supreme Court: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పద్మావతి నిలయంలో కొత్తగా కలెక్టరేట్ ఏర్పాటునకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పద్మావతి నిలయంలో తాత్కాలికంగా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటునకు అభ్యంతరం ఎందుకని సుప్రీం కోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. ఈ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
Supreme Court: ఏపి హైకోర్టు ఆదేశాలపై స్టేకు నిరాకరణ
తిరుపతి పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయవద్దంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన ఏపి హైకోర్టు సింగిల్ జడ్జి పిటిషనర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను సవాల్ చేసింది. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ .. పద్మావతి నిలయంలోనే కలెక్టరేట్ ఏర్పాటునకు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును తోసిపుచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పిటిషనర్ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే కు నిరాకరించింది.