వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు తరచు జగన్మోహనరెడ్డి సర్కార్ ను ఇబ్బందులు పెట్టేందుకు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు పలు అంశాలపై హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్ లను దాఖలు చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ రిషికొండ పై తవ్వకాలపై ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. రఘురామ పిటిషన్ పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రతి ఇంచు జాగాకు సుప్రీం కోర్టు ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది.
హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకూ వేచి చూడాలని పిటిషనర్ కు తెలిపింది సుప్రీం కోర్టు. రుషి కొండలో రెండు కిలో మీటర్ల వరకూ తవ్వకాలు జరిపారని రామకృష్ణంరాజు తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు ఫోటోలు అందజేయగా జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేయలేదు.
రుషికొండపై తవ్వకాలపై గతంలోనే సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అభివృద్ధి – పర్యావరణ మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళ్లాలని సూచించింది సుప్రీం కోర్టు. అభివృద్ధి కూడా అవసరమేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఇంతకు ముందే ఏపి హైకోర్టు కేంద్ర పర్యవరణ బృందం సర్వే చేసి నివేదిక అందజేయాలని ఆదేశించింది.
ఏపిలోని ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు మేలు సీఎం జగన్