AP Govt: ఏపి ప్రభుత్వానికి కోర్టుల్లో షాక్ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఓ పక్క మొన్న హైకోర్టు టీటీడీ బోర్డుకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితుల జివోను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టులోనూ ఓ పెద్ద షాక్ తగిలింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది.
Read More: YSRCP: టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతున్న మరో మాజీ మంత్రి..! ఎవరంటే..?
దేవి సీ – ఫుడ్స్ లిమిటెడ్ కేసులో ఏపి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. గురువారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. విచారణ అనంతరం ఏపి ప్రభుత్వానికి లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు.
మరో పక్క ఇటీవల చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ, అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ నేతలపై వివిధ సెక్షన్ల తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులపై టీడీపీ నేతలు ఏపి హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. ఈ కేసుల్లో నిందితులకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
Read More: MAA Elections: మంచు విష్ణు ప్యానల్ సభ్యులు వీళ్లే..