టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబందించి దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. నర్సీపట్నంలో తన ఇల్లు నిర్మించే క్రమంలో ఎన్ఓసీ కోసం నీటి పారుదల శాఖ అధికారి సంతకాలను అయ్యన్న ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అయ్యన్న హైకోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం విచారణ చేపట్టిన హైకోర్టు ఆ కేసుపై మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫోర్జరీ చేసి.. ఎన్ఓసీ తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారి పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం .. ఫోర్జరీ సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
బిల్డింగ్ ప్లాన్ విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో అయ్యన్నపాత్రుడుపై ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన కేసును మెరిట్స్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు.. అమరావతి పిటిషన్లపై మార్చి 28న విచారణ