NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధాని అమరావతిపై నేడు సుప్రీం కోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ

అమరావతి రాజధాని కేసుపై సుప్రీం కోర్టులో ఇవేళ (మంగళవారం) విచారణ జరగనున్నది. అమరావతి కేసులతో పాటు రాష్ట్ర విభజన కేసులను జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనున్నది. ఈ విచారణ సందర్భంగా ఇవేళ వాదనలే కొనసాగుతాయా.. ఉత్తర్వులు ఏమైనా వెలువడతాయా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ పక్క సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగానే విశాఖ పరిపాలనా రాజధాని అవుతోందనీ, త్వరలో తాను విశాఖ షిప్ట్ అయి అక్కడి నుండే పాలన సాగించనున్నట్లు ఏకంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొనడం, మంత్రులు, వైసీపీ పెద్దలు కూడా న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందని చెబుతుండటంతో సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Supreme Court

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం లేదని హైకోర్టు పేర్కొనడాన్ని ఏపి శాసనసభ కూడా తప్పుబట్టింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమతమ అధికార పరిధుల్లో పని చేయాలని, శాసన, పాలన వ్యవస్థ అధికారంలోకి న్యాయ వ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్దమని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంటుందని పిటిషన్ లో విన్నవించింది.

రాజధానిపై శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక, జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపపర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధాని కేవలం అమరావతిలో కేంద్రీకృతం చేయకుండా వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయని తెలిపింది. 2014 – 19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో పది శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయని వివరించింది. మరో పక్క ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం గతంలోనే ఏపి రాజధాని అమరావతిగా నోటిఫై అయ్యిందని, మూడు రాజధానుల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి తీసుకోలేదంటూ అఫిడవిట్ లో పేర్కొంది. ఈ పిటిషన్ పై ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది అత్యవసరంగా విచారణ జరపాలని కోరినా ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పును యదాథదంగా అమలు చేయాలని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

రాపాక సారూ.. ఎమిటీ వ్యాఖ్యలు..! ఇది సోషల్ మీడియా యుగం.. ఆడేసుకుంటారు..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N