NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి సర్కార్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం .. అమరావతి కేసు ఆ రోజునే విచారణ

ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. అమరావతి రాజధాని కేసు త్వరిగతిన విచారణ జరపాలని ఏపి సర్కార్ మరో మారు కోరినా ధర్మాసనం తిరస్కరించింది. ఇంతకు ముందు ప్రకటించిన తేదీనే ( ఈ నెల 28వ తేదీ) విచారణ జరుపుతామని స్పష్టం చేసింది జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం. అమరావతి కేసు విషయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది గురువారం నాడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంతకు ముందు ప్రకటించిన 28వ తేదీ కాకుండా విచారణ త్వరితగతిన జరపాలని కోరారు.

Supreme Court

 

అమరావతి రాజధాని కేసు పరిధి చాలా పెద్దదనీ, విచారణ చేపడితే సార్ధకత ఉండాలని జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. ఇందులో రాజ్యాంగపరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతకు మించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీ మంగళవారం అయినందున ఒక్క రోజులో విచారణ సాధ్యం కాదనీ, 29, 30 తేదీలలో కూడా విచారించాలని ఏపి ప్రభుత్వ న్యాయవాదులు విన్నవించారు. బుధ, గురువారాల్లో నోటీసులిచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్యులర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరగా, సీజేఐ సర్క్యులర్ విషయం తెలియజేసి తోసిపుచ్చింది.

అమరావతి కేసు విచారణ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గత సోమవారం ద్విసభ్య ధర్మాసనం ముందు ఉంచిన సంగతి తెలిసిందే. జస్టిస్ కేఎం జోసెఫ్ , జస్టిస్ బీవి నాగరత్న తో కూడిన ధర్మాసనం .. మార్చి 28న విచారణ చేపడతామని తెలిపింది. అయితే మూడు రోజులైనా గడవక ముందే మరో సారి ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. హైకోర్టులో విచారణ సమయంలో వాయిదాల వాయిదాలు అడిగి మూడేళ్ల పాటు ప్రభుత్వం సాగదీసిందనీ, హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కూడా ఆరు నెలల పాటు ఎస్ఎల్‌పీ ఫైల్ చేయకుండా తాత్సారం చేసి ఇప్పుడు త్వరితగతిన విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో విజ్ఞప్తుల విజ్ఞప్తులు చేస్తుండటం ఏమిటని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సుప్రీం కోర్టులో రాజధాని అంశం పై తీర్పు వచ్చేస్తే అంత త్వరగా మరో సారి అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు పెట్టేసి వెంటనే విశాఖను రాజధాని చేయవచ్చని జగన్ సర్కార్ భావిస్తున్నది. అందుకే ఢిల్లీ వేదికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విశాఖ రాజధాని అవుతోందనీ, త్వరలో తాను విశాఖకు షిప్ట్ అయి అక్కడి నుండే పరిపాలన సాగిస్తానని తెలియజేశారు.

ఈసీ నియామకాలపై సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?