ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల గురించి , పరిపాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. రామతీర్థంలో విగ్రహం ధ్వంసం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అయితే , ఇదే సమయంలో కొత్త విమర్శ ప్రస్తావనకు వచ్చింది.
విజయసాయిరెడ్డి కలకలం
రామతీర్థం విగ్రహ ధ్వంసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన లోకేష్ కనుసన్నల్లో జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఘటన జరగడానికి ముందురోజు కొండపైకి టీడీపీకి చెందినవారు వెళ్లారని అన్నారు. ఆధారాలు కూడా ఉన్నాయని.. బాధ్యులకు శిక్ష తప్పదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు . చంద్రబాబు ఒక కుట్రదారుడని ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం జగన్కు నారా లోకేశ్ సవాల్ విసిరారు.
లోకేష్ సంచలనం ….
రామతీర్థం ఘటనల వెనుక లోకేశ్, చంద్రబాబు హస్తం ఉందన్న విజయసాయిరెడ్డి ఆరోపణలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు . తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. జగన్కు దమ్ముంటే సింహాచలం ఆలయానికి రావాలని డిమాండ్ చేశారు. జగన్ పార్టీ ఫేక్.. హామీలు ఫేక్.. పాలన ఫేక్ అంటూ ఓ రేంజ్లో లోకేష్ ఫైరయ్యారు.
దేవుళ్లకు రక్షణ లేదా ?
ఏపీ సీఎం జగన్ పాలనలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. దేవాదాయ శాఖా మంత్రి ఉన్నాడో.. లేడో కూడా అర్థం కావడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు . కాగా, తలెగుదుఏశం పార్టీ తరఫున ఇలాంటి విమర్శలను సీఎం జగన్ ఎదుర్కునే బదులుగా ఇప్పటికే తీసుకుంటున్నా చర్యలకు తోడుగా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడం ఉత్తమమని పలువురు అంటున్నారు.