Breaking: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. సినీనటుడు, నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీ వరద రాజ స్వామి ఆలయంలో పూజల అనంతరం నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం కొద్ది దూరం నడిచిన తర్వాత మసీదులో లోకేష్ ప్రార్ధనలు నిర్వహించారు. లోకేష్ తో పాటు తారకరత్న కూడా పాల్గొన్నారు.
మసీదు నుండి బయటకు వచ్చే సమయంలో కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తారకరత్నను స్థానిక టీడీపీ నేతలు కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. బాలకృష్ణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Nara Lokesh: కుప్పం నుండి యువగళం పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్