AP Politics: అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోకుంటే అది రాజకీయమే కాదు. అధికారం మారిన తర్వాత మొదటి ఏడాది అధికార పార్టీకి హనీమూన్ అయితే.. ప్రతిపక్షాలకు రిలాక్షేషన్. రెండో ఏడాది విమర్శలు మొదలుపెడతారు. మూడో ఏడాది ప్రజలకు ప్రభుత్వం తప్పులు చూపిస్తారు.
నాలుగో ఏడాది రావడంతోనే ఎన్నికల ప్రక్రియ దాదాపు మొదలయినట్టే. ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలుపెట్టి విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లడానికి మళ్లీ అలవాటు పడుతూంటారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత బెటర్.. మన సత్తా చాటేద్దాం.. అధికారం మనదే అనే ఊహల్లో ఉంటారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అలానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. టీడీపీ, బీజేపీ, జనసేన తమ పని తాము చేసుకుంటున్నాయి.
AP Politics: విపక్షాల ముప్పేట దాడి..
ముఖ్యంగా సీఎంగా జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి ప్రజలకు వివరిస్తున్నారు. రోడ్ల పరిస్థితి, ఇసుక రేట్లు.. ఇలా ప్రజల్లోకి ప్రభుత్వ పని తీరుని ఎండగడుతున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలంటూ బీజేపీ, టీడీపీ, జనసేన డిమాండ్ చేస్తూ వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సోము వీర్రాజు ఏకంగా తాము అధికారంలోకి వస్తే 75కే మద్యం పంపిణీ చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో, సంస్థాగత ఇబ్బందులతో వైసీపీని టీడీపీ ఎదుర్కోలేకపోతోంది. అయితే.. రాష్ట్రం అప్పులకుప్ప అవుతోంది.. సీఎంగా జగన్ విఫలం.. వచ్చే ఏడాదే ఎన్నికలు అంటూ ఉనికి చాటుకుంటోంది టీడీపీ. పవన్ కల్యాణ్ ఒక్కసారే విరుచుకుపడి కొన్నాళ్ల వరకూ కావాల్సిన స్టఫ్ ఇచ్చేస్తున్నారు.
జగన్ ను ఇబ్బంది పెట్టగలరా..
సీఎం జగన్ మాత్రం తాను ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ.. పథకాల అమలులో ఇబ్బందులున్నా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. పారదర్శకంగా ప్రజలకు మేలు జరగడం, పధకాలు అమలవుతూండటంతో జగన్ వాళ్లెవరికీ అవకాశం ఇవ్వడం లేదు. కేవలం పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఇదే జగన్ పై గతంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం.. అనంతర పరిస్థితులు తెలిసిందే.
అయితే.. మూడేళ్లుగా ఇన్ని పధకాలు అమలవుతున్నా.. జగన్ పై అవినీతి ఆరోపణలు మాత్రం ప్రతిపక్షాలు చేయకపోవడం.. జగన్ సాధించిన విజయంగానే చెప్పాలి. అయితే.. జగన్ ఎదుర్కొనేందుకు పార్టీలు కొత్త దారులు వెతుకుతాయనడంలో అతిశయోకతి లేదు. మొత్తంగా రాజకీయ పార్టీలన్నీ తమ గేమ్ స్టార్ట్ చేశాయనే చెప్పాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?