Breaking: టీడీపీ ఇదేమి ఖర్మ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టును సందర్శనకు చంద్రబాబుకు పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసులు, టీడీపీ శ్రేణులకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్కడ భైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను అధికారంలో ఉండగా 72 శాతం పోలవరం పనులు పూర్తి చేశామన్నారు. తనకు ఆ ప్రాజెక్టు సందర్శనకు అవకాశం లేదని చెప్పడం దుర్మార్ఘమన్నారు.
ఏ కారణంతో తనను పోలవరం ప్రాజెక్టు కు వెళ్లవద్దని అంటున్నారని పోలీసు అధికారులు సమాధానం చెప్పాలన్నారు. రాత్రి సమయం కావడంతో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దని చెబుతున్నారని, రేపు ఉదయం వస్తే ప్రాజెక్టు సందర్శనకు అవకాశం ఇస్తారా సమాధానం చెప్పాలన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. పోలీసులు తనకు సమాధానం చెప్పాలంటూ ఇక్కడే ఉంటానని చెప్పి భైటాయించారు. ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, తన హక్కుకు భంగం కల్గించకూడదని అన్నారు. ఈ సందర్భంగాా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్న పోలీసులు.
పోలీసులతో నాయకుల వాగ్వివాదం. ప్రాజెక్ట్ కు వెళ్ళే రోడ్డుపై బైఠాయించి టీడీపీ అధినేత నిరసన.#CBNInEluru #NCBN#TDPforDevelopment #IdhemKarmaManaRashtraniki #PolavaramPaaye pic.twitter.com/BoJJ8XP4zr
— Telugu Desam Party (@JaiTDP) December 1, 2022