YSRCP: కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ రీసెంట్ గా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. జయమంగళ వెంకట రమణతో పాటు టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి సీఎం జగన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
జయమంగళ వెంకట రమణ 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో కామినేని శ్రీనివాస్ గెలుపునకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మరో సారి పోటీ చేశారు కానీ వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) చేతిలో పరాజయం పాలైయ్యారు. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. నిన్ననే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జయమంగళ వెంకట రమణ పార్టీ చేరిక కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులు పాల్గొన్నారు. జయమంగళ వెంకట రమణకు సీఎం జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
Breaking: బీజేపీకి కన్నా రాజీనామా .. ఏపి పార్టీ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు..ట్విస్ట్ ఏమిటంటే..?