TDP Mahanadu 2022: ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగిన మహానాడు విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. పార్టీ అంచనాలకు మించి పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్లు వార్తలు రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, వర్ల రామయ్య, తదితర సీనియర్ నాయకుల ప్రసంగాలు పార్టీ కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత టీడీపీ మహానాడు నిర్వహించలేదు. ఆ తరువాత రెండేళ్లు కరోనా కారణంగా మహానాడు బహిరంగంగా నిర్వహించలేదు. ఆన్ లైన్ లోనే నిర్వహించుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TDP Mahanadu 2022: అంచనాలకు మించి..
మూడేళ్ల తరువాత బహిరంగంగా జరిగిన ఈ మహానాడుకు అధికార పక్షం నుండి తొలుత అనేక ఇబ్బందులు ఎదురైనా నిన్న ప్రతినిధుల సభకు, నేడు బహిరంగ సభకు అంచనాలకు అధిగమించి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. నిన్న ప్రతినిధుల సభలో పలు తీర్మానాలను నేతలను ప్రతిపాదించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పలువురు మాజీ మంత్రులపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం, కార్యకర్తలపై వివిధ రకాల కేసులు నమోదు చేయడం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం అలుముకుంది. దాంతో స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయాలు నమోదు చేసుకుంది. ఆ తరువాత మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో చంద్రబాబు రెండు రోజుల పాటు దీక్ష చేయగా పార్టీ శ్రేణుల్లో కొంత కదలిక మొదలైంది.
అనంతరం టీడీపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పార్టీ కార్యకర్తలు చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ఒంగోలు మహానాడు తలపెట్టగా వేదిక ఏర్పాటునకే తొలుత ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీ శ్రేణుల కోసం ఆర్టీసీ బస్సుల ఏర్పాటునకు ప్రయత్నించినా కుదరనివ్వలేదు.
ఇదే క్రమంలో ఇటు మహానాడు జరుగుతున్న సమయంలో వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ప్రారంభించారు. మీడియా ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ఈ ఎత్తుగడ వేసిందని టీడీపీ విమర్శించింది. ఇదిలా ఉంటే మహానాడుకు ఎంత మంది హజరయ్యారు అనే దానిపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి వైసీపీ అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తొంది. ఈ మహానాడులో పార్టీ అధికార ప్రతినిది కావలి గ్రీష్మ ప్రసాద్ ఆవేశంగా ప్రసంగిస్తూ వైసీపీ సర్కార్ కు తొడగొట్టి సవాల్ విసరడం హైలెట్ గా నిలిచింది.