TDP MLA Kinjarapu Achennaidu: ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ విచారణకు హజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన నేపథ్యంలో చర్యల నుండి సేఫ్ అయినట్లేననే వాదనలు వినబడుతున్నాయి. అయితే కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు పై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. కమిటీ ముందు హజరైన అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలు స్పీకర్ కు బాధకల్గించినట్లైయితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రివిలేజ్ కమిటీ విచారణకు అచ్చెన్నాయుడు న్యాయవాదితో కలిసి రావడానికి ప్రయత్నించగా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆయన ఒక్కరే కమిటీ ముందు హజరై వివరణ ఇచ్చారు.
ప్రివిలేజ్ కమిటీ సమావేశం అనంతరం చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారనీ, ఆయన వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామని చెప్పారు. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం వెల్లడిస్తామన్నారు. కాగా మరో టీడీపీ నేత కూన రవి అందుబాటులో లేనని సమాచారం ఇచ్చారనీ, మరొక అవకాశం ఇస్తే కమిటీ ముందు హజరు అవుతానని తెలిపారని కాకాణి వెల్లడించారు. రిటైర్డ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎమ్మెల్యే రామానాయుడులపై 21న జరిగే ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాణి తెలిపారు.
Read More:
1.Revanth Reddy: కేసిఆర్ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి..! క్యాడర్ కు హెచ్చరికలు..!!
2.AP EAPCET: ఏపి ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల..! టాప్ టెన్ ర్యాంకులు సాధించింది వీళ్లే..!!
3.MODI America Tour: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారు..! 24న జోబైడెన్ తో భేటీ..!!