MP Kesineni Nani: టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు చాలా కాలం నుండి ఉన్న సంగతి తెలిసిందే. నాని చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, ఆగ్రహాన్ని బహిర్గతం చేసినట్లుగా కనబడుతోంది. ఓ రాజకీయ పార్టీకి ఎంపిగా ఉన్న కేశినేని.. తాను అందరి వాడిని, ఏ పార్టీకి చెందిన వాడిని కాదు అని వ్యాఖ్యలు చేయడంతో పాటు పార్టీ హైకమాండ్ కు పరోక్షంగా హెచ్చరికలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అవుతున్నాయి. తన శత్రువులను మీరు ప్రోత్సహిస్తే నేను మీ శత్రువులతో చేతులు కలుపుతానంటూ ఇన్ డైరెక్ట్ గా పార్టీ అధిష్టానంకు హెచ్చరికలు జారీ చేశారు. కేశినేని ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జి గా ఉన్నా అక్కడి నేతలు ఆయనకు సహకరించడం లేదని అంటున్నారు. దీనికి తోడు నాని వ్యతిరేకులకు పార్టీ ప్రోత్సహిస్తొందన్న నాని వర్గం ఆరోపిస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కొంత కాలం క్రితమే చెప్పేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ తరుణంలోనే నాని వ్యతిరేక వర్గంగా ముద్రపడిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బొండా ఉమామహేశ్వరరావులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. బుద్దా వెంకన్నకు ఉత్తరాంధ్ర కు పార్టీ ఇన్ చార్జి గా కూడా నియమించారు. అసలు విషయానికి వస్తే .. నాని సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని చిన్ని చెబుతుండటంతో నాని అగ్రహంతో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టీడీపీకి నాని షాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. పార్టీ విషయంలో నాని ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.