Tdp : రేపు అసలైన ప్రెస్ మీట్ అంటున్న ఆ అధికారి, భయపడుతున్న టీడీపీ నేతలు..!!
Tdp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా బయటపడుతున్న కుట్రలు, భాగోతాలు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల విషయంలో కొంతమంది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవాళ్లు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేతలు కలసి మరి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పోలీసుల ప్రాణాలను తీసే రీతిలో నిర్ణయాలు ఉన్నట్లు తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాక్సిన్ వేయించుకోవటం అనేది జాతీయ స్థాయి కార్యక్రమం అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు త్వరలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, ఇలాంటి సమయంలో ఎన్నికల విధులు ఎలా నిర్వహిస్తారు అన్న రీతిలో మాట్లాడారు.
Tdp : ఏపీ డీజీపీ మీడియా సమావేశం:-
పరిస్థితులు ఇలా ఉండగా విగ్రహాల ద్వాంసం ఘటన కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లు అదేవిధంగా లోకల్ ఎలక్షన్ విషయానికి సంబంధించి ఫోన్ కాల్స్ లో బయటపడుతున్న వ్యవహారాలు బట్టి చూస్తుంటే పంచాయతీ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ఉన్నాయి అని డీజీపీ పేర్కొన్నారు. పైగా ఇలాంటి వాళ్లే పోలీస్ వ్యవస్థ పై విమర్శలు చేయడం బాధాకరమని, రేపు అసలైన ప్రెస్ మీట్ ఉంటుందని అన్ని విషయాలు బయట పెడతా అన్నట్టు ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు టిడిపి నాయకుల గుండెల్లో గుబులు పుడుతున్నట్లు టాక్ వినపడుతోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలో అదేవిధంగా పంచాయతీ ఎన్నికల విషయంలో బెదిరింపు కాల్స్ కి టిడిపి వాలే ఉండటంతో .. రేపు ఎలాంటి విషయాలు మీడియా సమావేశంలో బయట పడతాయో అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో గట్టిగా జరుగుతోంది.
విగ్రహాల ధ్వంసం ఘటన విషయంలో ఏకంగా పోలీసు వ్యవస్థ ని టార్గెట్ చేసి మతాన్ని ఆపాదించి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం అప్పట్లో అందరికీ తెలిసిందే. కానీ విచారణలో ఏకంగా పూజారికి డబ్బులు ఇచ్చి టిడిపి నాయకులు విగ్రహాల పగలగొట్టే కార్యక్రమానికి రెడీ అయినట్లు నిజాలు బయట పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.